NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి నాయకుల పోరాట ఫలితంగానే పెన్షన్ల పంపిణీ..పార్లమెంట్​ అభ్యర్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించడం పై కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.. టిడిపి నాయకుల పోరాట ఫలితంగానే జిల్లా ఉన్నతాధికారులు స్పందించారని నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా పెన్షన్ల పంపిణీ విషయంలో విపక్షాల పై బురదచల్లడం మానుకొని పెన్షన్ దారులకు పెన్షన్లు పంపిణీ చేయాలన్న ఆయన…జిల్లా కలెక్టర్ సూచించిన విధంగా ఈ నెల 4,5 వ తేదీల లోపు పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు.

About Author