PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డోన్ అసెంబ్లీ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే ..ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం..

1 min read

పల్లెవెలుగు వెబ్ డోన్​ :  కొట్టె మల్లికార్జున బిజెపి యువ నాయకులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికల వేడి మొదలైంది అనే విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు విడుదల అవ్వగానే అన్ని రకాల రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రచార కార్యక్రమంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి యువనాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు త్రిముఖ కూటమిగా  వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే లక్ష్యంగా పోటీ  చేస్తున్నాయి.  మొత్తం 175 సీట్లలో బిజెపి 10 ఎమ్మెల్యే 6 ఎంపీ,టిడిపి 144 ఎమ్మెల్యే 17 ఎంపీ ,జనసేన 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఏపీలో అందరి కళ్ళు డోన్ అసెంబ్లీ వైపే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఏపీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్న డోన్ అసెంబ్లీలో త్రిముఖ కూటమి బిజెపి టిడిపి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడు మాజీ కేంద్ర రైల్వే మంత్రి, మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం మరియు నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి అక్క గెలుపు కోసం పోరాడతాము. నంద్యాల జిల్లా మరియు డోన్ అసెంబ్లీ గడ్డలో త్రిముఖ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి నియంతృత్వ పోకడలతో ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనే కాకుండా, నంద్యాల జిల్లాలో అలాగే డోన్ నియోజకవర్గంలో గద్దె దింపి డాక్టర్ బై రెడ్డి శబరి,కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గెలుపును విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, యువత కోసం కృషి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు,ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరికి కానుకగా ఇస్తామని  మీడియాతో  బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున పేర్కొన్నారు.

About Author