PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతను..ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతా..

1 min read

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​

కర్నూలు, పల్లెవెలుగు:  నగరంలోని యువతను ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతానని, ఇందుకు వివిధ రంగాల్లో నైపుణ్యత పొందేలా శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు వైసీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​. గురువారం రంజాన్​ పర్వదినం సందర్భంగా నగరంలోని 42,44,45 వార్డులకు సంబంధించిన యూత్ కార్యకర్తలు పాటిల్ తిరుమల్ రెడ్డి సమక్షంలో వైసీపీ MLA అభ్యర్థి ఇంతియాజ్  పార్టీ కార్యాలయం లో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా ఇంతియాజ్​ మాట్లాడుతూ యువతకు డిగ్రీ, పీజీ పట్టాలు ఉన్నాయి కానీ… ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్యత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు నగరంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్​ హామీ ఇచ్చారు.

About Author