PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవ చేసేందుకు వ‌స్తున్న నాకు ప్రజ‌లంద‌రూ మ‌ద్దతివ్వాలి.. టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

టి.జి భ‌ర‌త్ కార్యాల‌యంలో దేవాల‌యాల భ‌జ‌న బృందాల స‌మావేశం

క‌ర్నూలు అభివృద్ధి కోసం త‌న‌కు మ‌ద్దతివ్వాల‌ని కోరిన టి.జి భ‌ర‌త్

టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్దతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిన దేవాల‌యాల భ‌జ‌న బృందాల స‌భ్యులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలో ఉన్న ఆల‌యాల భ‌జ‌న బృందాల స‌భ్యులంద‌రూ రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేసి గెలిపించాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ కోరారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లోని టి.జి భ‌ర‌త్ కార్యాల‌యానికి వ‌చ్చిన క‌ర్నూలు సిటీలోని దేవాల‌యాల భ‌జ‌న బృందాల స‌భ్యుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తాము రాజ‌కీయాల్లో ఉన్నట్లు చెప్పారు. త‌న తండ్రి టి.జి వెంక‌టేష్ క‌ర్నూలు ప్రజ‌ల‌కు ఎంతో సేవ చేశార‌న్నారు. కర్నూలు అభివృద్ధిలో టి.జి వెంక‌టేష్ పాత్ర ఎంతో కీల‌క‌మ‌న్నారు. ఆయ‌న మాదిరిగానే ప్రజ‌ల‌కు మంచి చేయాల‌న్న ఉద్దేశంతో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న త‌న‌కు మ‌ద్దతివ్వాల‌ని టి.జి భ‌ర‌త్ వారిని కోరారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని రంగాలు ఎంతో న‌ష్టపోయాయ‌న్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మ‌ళ్లీ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుంద‌న్నారు. క‌ర్నూల్లో ప్రస్తుతం ప్రజ‌లెదుర్కొంటున్న త్రాగునీటి స‌మ‌స్యకు ఈ పాల‌కుల నిర్లక్ష్యమే కార‌ణ‌మ‌న్నారు. తాను గెలిచిన త‌ర్వాత త్రాగునీటి స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం చూపుతాన‌ని హామీ ఇచ్చారు. ప‌రిశ్రమ‌లు తీసుకొచ్చి క‌ర్నూలు యువ‌తీ,యువ‌కుల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని చెప్పారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు వ‌స్తున్న త‌న‌కు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాల‌న్నారు. అనంత‌రం భ‌జ‌న బృందాల స‌భ్యులంతా టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్దతిస్తామ‌ని చెప్పారు. టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట‌ర్ ప‌ర‌మేష్‌, ఆల‌యాల‌ భ‌జ‌న బృందం స‌భ్యులు బ‌స‌వ‌రాజు, నాగార్జున‌, రామ‌లింగ‌య్య‌, అడ్వకేట్ నాగార్జున‌, వెంక‌టేశ్వర్లు, గిడ్డయ్య‌, భాస్కర్, పెంచలయ్య, కస్తూరి వెంకటేశ్వర్లు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author