PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తమ్మరాజు పల్లి చెక్ పోస్ట్ వద్ద 20 లక్షలు స్వాధీనం

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  శనివారం నాడు ఉదయం  పాణ్యం మండలము తమ్మరాజు పల్లి చెక్ పోస్ట్ వద్ద   పాణ్యం సీ ఐ నల్లప్పా ఏస్ ఐ అశోక్, పోలీస్ సిబ్బంది, మరియు బి.ఎస్.ఎఫ్. సిబ్బంది  వాహనాలు తనిఖీ చేయుచుండగా కర్నూల్ నుంచి నంద్యాల వైపు వెళుతున్న AP-39-MU-6767 కారు ను తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లేకుండా నగదును తరలిస్తున్న వ్యక్తి పేరు కల్లూరు రంగారెడ్డి,, గౌతమి నగర్, కర్నూలు పట్టణానికి చెందిన వ్యక్తి వద్ద  20 లక్షల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు.  సదరు నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపని కారణంగా, ప్రస్తుతం 2024 సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున సదరు డబ్బును ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి తరలిస్తున్నారని భావించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

About Author