జాతీయ రవాణా మాసోత్సవ కార్యక్రమాలు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/3-7.jpg?fit=550%2C413&ssl=1)
రోడ్ సేఫ్టీ పై సుమారు130 వాహనాలు తనిఖీలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించని 35 మంది వాహన దారుల కి జరిమానాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు జిల్లా రవాణా శాఖ వాహన తనిఖీ అధికారులు శుక్రవారం వట్లూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద సుమారు 130 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు ఇందులో హెల్మెట్ ధరించనవి, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటివి తదితర తదితర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై 35 కేసులు నమోదు చేసి ఐదు వాహనాలను నిర్బంధించారు. ద్విచక్ర వాహనం నడుపుతూ వచ్చిన రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను నాలుగు బృందాలుగా విభజించి వాహన తనిఖీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతను మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ప్రయోజనాలను వివరిస్తూనే రహదారి భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారుఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి శేఖర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఎండి జమీర్ కళ్యాణి నెహ్రూ పి నరేంద్రబాబు డి ప్రజ్ఞ పాల్గొన్నారు.