NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో..మాజీ సైనికుడు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులో నగరంలో బుధవార పేటలో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు (హవల్దార్)శివ రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య పాత్రికేయులకు తెలిపారు.గత 24 సం.గా సైన్యములో విధులు నిర్వహించారని ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కర్నూలులో ఉన్న రేడియో స్టేషన్ లో పని చేశారని అంతే కాకుండా ఆయన సైన్యంలో చేసిన సేవలు ఎనలేనివని వారు గుర్తు చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా కుటుంబ సభ్యులకు సంక్షేమ సంఘం తోడుగా ఉంటుందని ఆయన అన్నారు.

About Author