NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పి.డి.ఎస్.యు విలీన సభను జయప్రదం చేయాలి…

1 min read

పి.డి.ఎస్.యు పట్టణ కార్యదర్శి నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ…

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో 1974 అక్టోబర్ 12న  హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడిన  ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం  పి.డి.ఎస్.యు తన 50 ఏళ్ల అర్ధ శతాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకుంది. 2013లో రెండుగా చీలిన పి.డి.ఎస్.యు, ప్రస్తుతం రెండు కార్యవర్గాలు నెల్లూరు నగరంలో ఈనెల 14న విలీన సభ నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పోస్టర్లు  ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ ఆలూరు పట్టణ కార్యదర్శి నరసింహ రెడ్డి మాట్లాడుతూ..పి.డి.ఎస్.యు సంఘం చరిత్రలో  చారిత్రాత్మకమైన సందర్భం అన్నారు.ఈ ఐక్యత దేశంలో ఉన్న మరిన్ని విప్లవ విద్యార్థి సంఘాల ఐక్యతకు తోడ్పాటున అందిస్తుందన్నారు. దీని ద్వారా దేశంలో బలమైన  విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామన్నారు.దేశంలో నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయిందన్నారు.యూజీసి నియమ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద శక్తులుగా నిలయాలుగా మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. కావున నెల్లూరు నగరంలో 14న జరిగే పిడియస్ యు సంస్థల విలీన సభకు విద్యావంతులు మేధావులు విద్యార్థులు యువత ప్రజాస్వామ్యవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్, రాకేష్, అబ్దుల్, కార్తీక్,చరణ్, హనుమేష్  తదితరులు పాల్గొన్నారు.

About Author