హైపిటైటిస్ బి ..సి పరిక్షలు,వ్యాక్సిన్, మందులు పంపిణీ
1 min read
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ లో భాగంగా కార్యక్రమం
మెడికల్ సూపర్డెంట్ ఎన్ సునీత
వారానికి ఒక్కరోజు పరీక్షలు, వ్యాక్సిన్ వేసి, మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాం
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు మరియు బలహీన వర్గాల మహిళలకు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం, బీమడోలు, లింకు ఏ ఆర్ టి కేంద్రము నందు హైపిటైటిస్ బి మరియు సి పరీక్షలు నిర్వహించి వారికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని మెడికల్ సూపరింటెండెంట్ డా:ఎన్.సునీత తెలిపారు. ఈ కార్యక్రమంను ప్రారంభించి సునీత మాట్లాడుతూ వారానికి ఒకరోజు ఈ హైపిటైటిస్ బి & సి పరీక్షలు మరియు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పి. బాలాజీ పాల్గొని ట్రాన్స్ జెండర్లకు హైపిటైటిస్ వ్యాధి పై అవగాహన కల్పించి, ప్రభుత్వము అందిచే ఉచిత అందించే హైపిటైటిస్ బి, సి పరీక్షలు మరియు వ్యాక్సిన్ సేవలను అందుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏ. హరినాధ్ కుమార్, జిల్లా సూపర్ వైజర్, హెడ్ నర్స్ ఎన్. శైలజ, కౌన్సెలర్ సి. హెచ్. సింహాద్రి, ల్యాబ్ టెక్నీషియన్ బి. పాపరావ్, ప్రాజెక్టు మేనేజర్ శిరీష, ఆర్ హెడ్స్ స్వచ్చంద సంస్థ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
