పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన వైసిపి పి ఏ సీ సభ్యులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జమ్ము కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని వైస్సార్సీపీ పి ఏ సీ సభ్యుడు హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముష్కర మూకల పిరికిపంద చర్యగా పేర్కొంటూ, దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాదని ఆయన చెప్పారు.పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగ పరిచే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా, దేశవ్యాప్తంగా అందరు ఐక్యంగా పోరాడాలని హఫీజ్ ఖాన్ అన్నారు.ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.