NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన వైసిపి పి ఏ సీ సభ్యులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని వైస్సార్సీపీ పి ఏ సీ సభ్యుడు హఫీజ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అమాయక పర్యాటకులపై కిరాతకమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ముష్కర మూకల పిరికిపంద చర్యగా పేర్కొంటూ, దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరాదని ఆయన చెప్పారు.పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేపట్టిన ఈ దాడిని దేశ శాంతి భద్రతలను భంగ పరిచే చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడికి మతాలు, రాజకీయాలు, లేదా ఏ ఇతర భేదాలను పైకి తీసుకోకుండా, దేశవ్యాప్తంగా అందరు ఐక్యంగా పోరాడాలని హఫీజ్​ ఖాన్​  అన్నారు.ఈ దాడిలో మరణించిన బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాధితులకు తగిన న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.

About Author