ముందస్తు అడ్మిషన్లకు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
1 min read
ముందస్తు అడ్మిషన్ల కోసం ప్రైవేట్ టీచర్లను వేధిస్తున్న విద్యాసంస్థలపై కేసు నమోదు చేయాలి
మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు ఆర్ ఏ వి ఎఫ్
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఏమ్మిగనూరు పట్టణంలో ని రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్ (ఆర్ ఏ వి ఎఫ్)ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ఖాజా మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కార్పొరేట్ విద్య సంస్థలు అయినా నారాయణ శ్రీ చైతన్య భాష్యం ఇంకా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న ఇతర ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వానిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లకు టార్గెట్ పూర్తి చేస్తేనే మీరు అడ్మిషన్లు ఇస్తేనే మీకు ఉద్యోగం జీతం ఉంటుందని వారిని ఎర్రని ఎండలో సైతం తిప్పుతూ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ ముదిరిందని ముందుగానే తల్లిదండ్రులకు బుక్స్ అంట కడుతూ సొమ్ము చేసుకుంటున్నారని వారు అన్నారు విద్యాశాఖ అధికారులు మాత్రం మామూలు మత్తులో మునిగి చూసి చూడనట్లు వ్యవహరిస్తూ విద్య హక్కు చట్టాన్ని అపహస్యం చేస్తున్న చోద్యం చూస్తూ ఉన్నారని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి ఈ కార్పోరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రవి మల్లికార్జున రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.