PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుమ‌ల‌త‌పై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కృష్ణరాజ‌సాగ‌ర్ జ‌లాశ‌యం నుంచి నీళ్లు లీక‌వుతుంటే.. ఎంపీ సుమ‌ల‌తను అడ్డంగా ప‌డుకోబెట్టాల‌ని మాజీ సీఎం కుమార‌స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ జ‌లాశ‌యానికి ప‌గుళ్లు ఏర్పడ్డాయ‌ని సుమ‌ల‌త ప‌లుమార్లు ఆరోపించారు. దీంతో జ‌ల‌వ‌న‌రుల విభాగం ముఖ్య ఇంజినీర్ల ప‌ర్యవేక్షణ‌లో త‌నిఖీలు నిర్వహించింది. ప‌గుళ్లు లేవ‌ని ఆ క‌మిటీ తేల్చింది. దీనిపై కుమార‌స్వామి స్పందించారు. కేఆర్ఎస్ ప్రాజెక్టు నుంచి నీరు లీక‌వుతుంద‌ని ప‌లుమార్లు సుమ‌ల‌త ఆరోపించార‌ని, ప్రాజెక్టును ఆమె ప‌ర్యవేక్షిస్తున్నట్టు ఉంద‌ని ఎద్దేవా చేశారు. లీకేజీలు నిలిచిపోవాలంటే సుమ‌ల‌త‌ను అడ్డుంగా పడుకోబెట్టాలంటూ విమ‌ర్శించారు. దీనిపై ఎంపీ సుమ‌ల‌త స్పందిస్తూ కుమార‌స్వామి వ్యాఖ్యలు ఆయ‌న వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయ‌ని అన్నారు. విమ‌ర్శలు చేయ‌వ‌చ్చు కానీ.. వ్యక్తిగ‌తంగా ఉండ‌కూడ‌ద‌న్నారు.

About Author