PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొలి ఏకాదశి సందర్భంగా సుగంధ ద్రవ్య జలాభిషేకము క్షీరాభిషేకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యోనమః దక్షిణాయన పుణ్య కాలము కర్కాటక సంక్రమణ తొలి ఏకాదశి పర్వదినము సందర్భంగా ఆశేష భక్తజన సమూహము నందు శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ కు సుగంధ ద్రవ్య జలాభిషేకము క్షీరాభిషేకము నిర్వహించడం జరిగినది. భక్తాదులు స్వయంగా కలశముతో సప్త ప్రదక్షణలు చేసి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవ విగ్రహమునకు అభిషేకము నిర్వహించుకున్నారు. అనంతరం విశేషముగా సూర్యనారాయణ మూర్తికి అలంకారము నిర్వహించి అర్చన, మహా మంగళహారతి, మంత్రపుష్పము, వేద స్వస్తి నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ సూర్య దత్త గోశాలలో భగవద్గీత పారాయణం నిర్వహించడం జరిగినది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు వేద ఆశీర్వచనం అందించడం జరిగినది. భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.

About Author