PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో 97% పింఛన్ల పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:  నందికొట్కూరు:నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సచివాల సిబ్బంది మరియు టిడిపి నాయకులు పింఛన్ల నగదును లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో సాయంత్రానికి 97% పింఛన్లను పంపిణీ చేసినట్లు 5,412 మొత్తం పింఛన్లకు గాను 5,281 పింఛన్లు పంపిణీ చేశామని ఎంపీడీఓ ఎస్ గంగావతి తెలిపారు.49 బన్నూరు గ్రామంలో మండ్ల సాంబరావుకు దివ్యాంగుల పింఛన్ 4 వేలు వస్తూ ఉండేది.కానీ ఈ నెలలో డిఎంహెచ్ఓ పింఛన్ 15 వేలు కొత్తగా మంజూరు అయింది.ఈ నగదును గ్రామ టిడిపి నాయకులు రమణారెడ్డి,సోఫీ సాహెబ్,పంచాయితీ కార్యదర్శి ఎస్ బీజాన్ భీ,గ్రామ సర్వేయర్ అజీమ్ దివ్యాంగుడి ఇంటికి వెళ్లి నగదును అందజేశారు. మండలంలోని కడుమూరు, చింతలపల్లి దేవనూరు జలకనూరు బైరాపురం అలగనూరు చౌటుకూరు వివిధ గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేశారు.

About Author