చౌక డిపో దుకాణాల్లో ఈ పాస్ మిషన్ సక్రమంగా నిర్వహించాలి
1 min read
చౌక డిపో దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
కర్నూలు, న్యూస్ నేడు: చౌక డిపో దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలను సక్రమంగా నిర్వహించాలని చౌక డిపో దుకాణాల డీలర్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఆదేశించారు.శనివారం కర్నూలు రూరల్ మండలంలోని జి. సింగవరం గ్రామం 14 వ చౌక డిపో దుకాణాన్ని జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.. అనంతరం కార్డుదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు జి.సింగవరం గ్రామంలోని 14 వ చౌక డిపో దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని, షాపులో ఉన్న, బియ్యము, చక్కెర, ఇతర రేషన్ ల స్టాక్ ను పరిశీలించడం జరిగిందన్నారు, అనంతరం ముగ్గురు కార్డుదారుతో మాట్లాడుతూ రేషన్ సక్రమంగా అందుచున్నదా? బియ్యం నాణ్యతతో ఉన్నాయా? డీలర్లు అదనంగా ఏమైనా డబ్బు వసూలు చేస్తున్నారా? డీలర్ షాపు ను నిర్దేశిత సమయానికి తెరుస్తున్నారా? అని జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. కార్డుదారులు మాట్లాడుతూ బియ్యం నాణ్యతతో ఉన్నాయని, రేషన్ షాపు నిర్ణీత వేళల్లో తెరుస్తున్నారని జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు. జూన్ ఒకటో తేదీ నుండి రేషన్ షాపుల వద్దనే రేషన్ తీసుకోవాలని, రేషన్ షాపులు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు తప్పనిసరిగా తెరిచి ఉంచాలని, రేషన్ షాప్ డీలర్లను ఆదేశించారు. షాప్ డీలర్ లు అందరూ షాప్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ రూరల్ తహసిల్దార్ రమేష్ బాబు, వీఆర్వో రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.