NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదపాడు శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం

1 min read

మంచి నడవడిక-మాట తీరు అనే అంశంపై విద్యార్థులకు బోధన

పర్యవేక్షించిన గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు

పోటీలో పాల్గొన్న వారికి ఆఖరి రోజు బహుమతి ప్రధానం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా 32వ రోజు 04/06/2025 బుధవారం విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్ “మంచి నడవడిక-మాటతీరు”అనే అంశంపై మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే పిల్లలకు సమాజం పట్ల అవగాహనను పెంచే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేసినారు.”చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు” అని పెద్దల యందు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి,దానగుణం కలిగి ఉండాలి,చదువుల యందు పరీక్షలలో కాపీలు రాయకూడదు,చెట్లను పెంచాలి, సెల్ ఫోన్ కన్నా పుస్తకాలే మిన్న అని చదువులతో పాటు ఆటపాటలు అవసరం, చేతనైన సహాయం చేయడం నేర్చుకోవాలి,అబద్ధాలు ఆడకూడదు,దొరికిన వస్తువులు తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి, తల్లిదండ్రులను శత్రువులుగా చూడకుండా వారితో ప్రేమగా మెలగాలి, ఎక్కడికి వెళ్లినా మర్యాదగా నిశ్శబ్దంగా ఉండాలి. గ్రంథాలయాలకు వచ్చి మంచి మంచి దేశ నాయకులు,నాలెడ్జ్ ను పెంచే పుస్తకాలను చదువుకోవాలి, మన నడవడిక మాట తీరు మార్చుకుని పెద్దల యందు గౌరవభావంతో మెలగాలి అని హితవు పలికారు. అనంతరం వేదుల చినవేంకటచయనులు రచించిన,” మాలోకం కథలు” పుస్తకం నుండి “చలాకీ పిల్లి”అనే నీతి కథను విద్యార్థులచే చదివించడం,కథలు చెప్పించడం,పుస్తక సమీక్ష చేయించడం జరిగినది. తరువాత విద్యార్థిని విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ పూడి రవికుమార్,అట్లూరి సతీష్ కుమార్,కుమారి నీలాద్రి నాగ పావని”స్వర్ణ ఆంధ్ర -2047″అనే అంశంపై “క్విజ్” పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు 23 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనినారు. ఈ శిక్షణా తరగతులను గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది. నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ఆఖరి రోజు 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు బహుమతి ప్రధానం జరుగును, పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచ్ పెట్టడం జరిగినది అని తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *