NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పామాయిల్ రైతులకు కనీస మద్దతు ధర కల్పించండి

1 min read

కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినతి

దిల్లీలోని కార్యాలయంలో స్వయంగా కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర  వాణిజ్య శాఖ కార్యదర్శి  సునీల్ బర్త్వాల్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలోని వాణిజ్య భవన్ లో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి  సునీల్ బర్త్వాల్ ను కలిసి ఎంపీ మహేష్ కుమార్ వినతి పత్రం అందజేశారు. 2025 మే 31న విడుదలైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటూ, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్‌పై 50 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించడం ద్వారా రైతులకు ప్రతి మెట్రిక్ టన్నుకు  రూ.22,000 రైతులకు లభించే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి  సునీల్ బర్త్వాల్ దృష్టికి ఎంపీ మహేష్ కుమార్ తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ సాగు చేస్తున్న  రైతులు, ముఖ్యంగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంకు సంబంధించిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ వివరించారు. దిగుమతులపై సుంకాన్ని 27.5 శాతం నుండి 16.5 శాతానికి తగ్గించడం వల్ల రెండు నెలల్లోనే కనీస మద్దతు ధర ధర రూ.1,25,000 నుండి రూ.1,11,000కి తగ్గిందని ఎంపీ తెలిపారు. విదేశీ మారకాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ పంట సాగును ప్రోత్సహిస్తున్నాయని, 1986లో మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు  తొలిసారి ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఆయిల్‌పామ్ సాగును ప్రారంభించారని ఎంపీ మహేష్ కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 1990లో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ తొలిసారిగా ఏపీలో వెయ్యి హెక్టార్లలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహకంగా రాయితీలు, కనీసం మద్దతు ధర హామీ ఇచ్చిందని ఎంపీ వివరించారు. ప్రస్తుతం 2.5 లక్షల ఎకరాలలో పామాయిల్ సాగు చేస్తున్నారని, 2.5 లక్షల మంది రైతులు నేరుగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా జీవిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఈ నేపథ్యంలో పామాయిల్ రైతులను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *