సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి
1 min read
– ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక
కర్నూలు, న్యూస్ నేడు: ఉపాధ్యాయ సంఘాల తో చర్చ జరిగిన సందర్బంగా విద్యా శాఖ అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదలీ లను మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి అని నిర్ణయం వెలువడడం తో నేడు కర్నూలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మెమోరియల్ మునిపల్ హై స్కూల్ యందు నిరసన కార్యక్రమం చేపట్టారు. రేపు 08.06.2025 (ఆదివారం) ఉదయం తొమ్మిది గంటలకు కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ను ముట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర నాయకులు ఆప్టా కాకి ప్రకాష్ రావు మరియు అపస్ సత్యనారాయణ సంయుక్త ప్రకటన చేశారు.నిరసన కార్యక్రమం లో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక కర్నూలు జిల్లా కన్వీనర్ సేవా లాల్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా యందు 8 సంవత్సరాల కాలం పూర్తి అయి కంపల్సరీ బదలీ కావలసిన 1500 మంది పైగా టీచర్లు మొత్తం 3500 పైగా ఖాళీలను ప్రాధాన్యత పరంగా వెబ్సైట్ యందు పొందుపరచాలి.ఈ ప్రాధాన్యత క్రమం లో పొరపాటు జరిగితే ఆ టీచర్ నష్టపోతారు అని చెప్పారు. పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి సెకండరీ గ్రేడ్ టీచరు లు అందరికీ జిల్లా పై పూర్తి అవగాహన ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ మంచిది అన్నారు. యు టీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవి కుమార్ వెబ్ కౌన్సిలింగ్ అనేది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు పూర్తిగా నష్టదాయకం అని రేపు జరగబోయే కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముట్టడికి నంద్యాల మరియు కర్నూలు జిల్లా నుండి మహిళా ఉపాధ్యాయులు తరలి రావాలని, అధిక సంఖ్యలో హాజరు అయి వెబ్ కౌన్సిలింగ్ విధానం పై వ్యతిరేకత ను ప్రభుత్వం నకు తెలియచేయాలి అన్నారు . ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు గోకారి ప్రభుత్వం బదలీ యందు తక్కువ సంఖ్య లో ఉండే స్కూల్ అసిస్టెంట్ ల వెబ్ కౌన్సిలింగ్ లో అనేక సాంకేతిక లోపాలు బయటికి వస్తున్నాయి. వాటినే సరిదిద్దలేక పోతున్నారు. అటువంటిది అధిక సంఖ్యలో ఉండే సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎలా వెబ్ కౌన్సిలింగ్ చేస్తారు అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమం తర్వాత ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు జిల్లా విద్యాధికారి కి సెకండరీ గ్రేడ్ టీచర్లకు వెబ్ కౌన్సిలింగ్ విధానం కు బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి అని కోరుతూ,దాని కొరకు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ను ముట్టడి చేస్తాం అని నోటీస్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో పి ఆర్ టి యు నాయకులు కృష్ణా రెడ్డి, ధనుంజయ, రామపక్కి రెడ్డి, చాంద్ బాషా, రవి ప్రకాష్, రామక్రిష్ణ యు టి ఎఫ్ నాయకులు రవి కుమార్, నవీన్ పాటిల్, హేమంత్ కుమార్ సురేష్ కుమార్ ఎస్ టి యు నుండి గోకారి, జనార్ధన్, మౌలాలి, అజమ్ భాషా అపస్ నుండి నాగిరెడ్డి, నాగస్వామి ఆప్టా నుండి మధుసూదన్ రెడ్డి, సేవా లాల్ నాయక్, రాజసాగర్ , రఫీ ఎస్ జి టి ఎఫ్ నుండి లక్ష్మయ్య, రాజ శేఖర్ వై ఎస్ ఆర్ టి ఎ నుండి ప్రతాప్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.