విద్యార్థి మిత్ర కిట్స్ ను సద్వినియోగంచేసుకొండి
1 min read
హెచ్.యం. కాటం శ్రీదేవి
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రభుత్వం విద్యార్థుల కోసం అందిస్తున్న విద్యార్థి మిత్ర కిడ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కాటం శ్రీదేవి మరియు మాజీ ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ కోరారు. శుక్రవారం బాలికలకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాఠ్యపుస్తకా లను, నోటు పుస్తకాలను, డిక్షనరీస్ ను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ను సరిగా సద్వినియోగం చేసుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, క్రమము తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి వస్తువును ఉపయోగించుకొని చదువుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయినీలు శాంతి సుధా, భారతి, శైలజ ,నిర్మల మరియు రుక్మిణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.