NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కెమెరా ద్వారా ఆటోమేటిక్ గా చలానా

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు  కర్నూ లు పట్టణ ప్రజలు కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కలిగిన కూడలి నందు RLVD(Red light violation detection) సిస్టం అమల్లో ఉన్నది కావున ప్రజలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి ట్రాఫిక్ సిగ్నల్స్ jump చేసి వాహనం ముందుకు వెళ్లిన మరియు వ్యతిరేక దిశలో వాహనంలో నడిపిన ఎడల సదరు వాహనమునకు RLVD  కెమెరా ద్వారా ఆటోమేటిక్ గా చలానా వేయబడును, వాహనదారుడు పదేపదే  ట్రాఫిక్ సిగ్నల్స్ నిబంధనలు అతిక్రమించిన యెడల సదరు వాహనమునకు నిబంధనలు అతిక్రమించిన ప్రతిసారి చలానా ఫైను రెట్టింపు అవుతుంది, వాహనం పైన ఉన్న చలానాలు సకాలంలో చెల్లించని యెడల వాహనము సీజ్ చేయబడును. కావున ప్రజలు విషయం గమనించి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ మేరకు వాహనం నడిపి ప్రమాదాల నివారణకు సహకరించగలరని కర్నూల్ ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూర్రుద్దీన్ తెలపడం అయినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *