NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడికి వెళ్లే ప్రతి ఒక్కరికీ..తల్లికి వందనం

1 min read

నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్య..

రామచంద్రారెడ్డి.. పాత్రికేయులు మధుకు నివాళులు

ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: కుటుంబంలో ఎంతమంది బడికి వెళ్లే విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ తల్లికి వందనం అందిస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.”తల్లికి వందనం”విద్యార్థుల తల్లుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి 13 వేల రూపాయలు జమ చేసింది.అందులో భాగంగా కాలనీలో నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సంగయ్య పేటలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో తల్లికి వందనం పథకం గురించి ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే  పాలాభిషేకం చేశారు.పుల్యాల రామచంద్రా రెడ్డి పాత్రికేయులు మధుకు ఘన నివాళులుపగిడ్యాల గ్రామంలో ఆర్ సీ రెడ్డి విద్యాసంస్థల అధినేత పుల్యాల నాగిరెడ్డి సోదరుడు పుల్యాల రామచంద్రా రెడ్డి మరియు మిడుతూరు మండల వార్త సీనియర్ పాత్రికేయులు మధు శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే.వీరి గృహాలకు వెళ్లి ఎమ్మెల్యే మరియు ఏఎంసీ డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియంవెంకటేశ్వర్లు యాదవ్,మిడుతూరు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి, పూలమాలలతో నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీమిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామానికి చెందిన హానిసా తబాస్సుమ్ కు ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి 62,470 రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో వంగాల శివరామిరెడ్డి, నందికొట్కూరు తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంఈఓ లు సుభాన్,శ్రీనాథ్,మల్లికార్జున రెడ్డి,డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *