NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రక్తదానం చేద్దాం..ప్రాణదాతలవుదాం…

1 min read

ఎన్​. చరణ్ ను యువస్పందన రక్తదాత అవార్డుతో సత్కరించిన యువస్పందన సొసైటీ..

పత్తికొండ, న్యూస్​ నేడు:  ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువస్పందన సొసైటీ ఆధ్వర్యంలో రక్త దాత అవార్డు కు చరణ్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు శనివారం రక్తదాత అవార్డు గ్రహీత ఎన్. చరణ్ కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువస్పందన సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సురేంద్ర, లక్ష్మణ్ మాట్లాడుతూ మనిషి జీవితంలో రక్తం చాలా ముఖ్యమైనది రక్త దానం చేయడం వలన ఎంతో మందికి ప్రాణ దానం చేసినవరవుతారని అన్నారు. అలాగే పత్తికొండ కు చెందిన ఎన్​. చరణ్ స్వచ్చందంగా 9 సార్లు కర్నూలు, హైదరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్లి రక్తదానం చేయడం అభినందనీయం అని స్వచ్చందంగా చేస్తున్న నిస్వార్ధ సేవకు గాను యువస్పందన సొసైటీ గుర్తించి ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా యువస్పందన రక్త దాత అవార్డుతో చరణ్ కి యువస్పందన అధ్యక్షుడు సురేంద్ర చేతుల మీదుగా సన్మానించడం జరిగిందని తెలిపారు. ఇదేవిధంగా రక్త దానంపై యువత అపోహలు వీడి ముందుకు వచ్చి రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అలాగే సన్మాన గ్రహీత చరణ్ తన సేవలు గుర్తించి అవార్డును అందించిన యువస్పందన సొసైటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువస్పందన సభ్యులు మధు, రమేష్, రాజేశ్వరి మరియు వీరేశ్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *