వెన్నుపోటు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రూపొందించిన “వెన్నుపోటు” పుస్తకాన్ని ఆవిష్కరించారు .ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ “ఈ వెన్నుపోటు పుస్తకంలో వ్యవస్థల కుప్పకూలిపోవడం నుంచి ప్రజల ఆర్థిక భద్రత కోల్పోవడం వరకు పలు కీలక అంశాలను స్పష్టంగా పొందుపరిచాం. ఇది ప్రజలకు నిజాన్ని తెలియజేసే ప్రయత్నం మాత్రమే కాదు… కూటమి పాలన అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచే బలమైన ఆధారం” అని తెలిపారు… ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ లు, కన్వీనర్ లు, కో కన్వీనర్ లు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సొసైటీ చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.