నూతన వ్యాపారలు ప్రారంభించిన ఎమ్మెల్యే ,మేయర్
1 min read
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలోపలువురు ఆహ్వానాల మేరకు ఉదయం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి ముఖ్య అతిథులుగ హాజరై స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలో కుబేర రెస్టారెంట్,తంగెళ్ళమూడి ప్రాంతంలో శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన బిల్డింగ్ ,కట్టా సుబ్బారావు తోట ప్రాంతంలో రైట్ ఛాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం పవర్ పేట లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు.సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, యర్రంశెట్టి సుమన్,దాకారపు రాజేశ్వరరావు,పాము శామ్యూల్,మాజీ ఇడా చైర్మన్ బోద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.