NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచాలి

1 min read

కాంప్లెక్ చైర్మన్ అన్వర్ బాషా

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపలి మండలం చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన హుస్సేనాపురం స్కూల్ కాంప్లెక్ చైర్మన్ అన్వర్ బాషా చేతులు మిదుగ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా మీ గ్రామ పాఠశాల మార్పు చెందిందని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు  తరగతి కి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడని కావున గ్రామంలోని పిల్లలందరినీ మీ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు.ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఉచిత యూనిఫాం, బుక్స్,షూ,బెల్ట్,సాక్స్ అన్ని దాదాపు 15000 విలువ కలవి ఉచితంగా ఇవ్వడమే కాకుండా మంచి మధ్యాహ్న భోజన వసతి..మంచి ఉపాధ్యాయులు వచ్చారు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు..గ్రామస్తులు  తప్పక పిల్లలందరినీ పాఠశాలలో చేరుస్తామని ,పాఠశాలకు సహకరిస్తామని మాటిచ్చారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ లతీఫ్,ఉపాధ్యాయులు రుక్మిణి,మురళీ,సర్వజ్ఞ మూర్తి,గ్రామస్తులు మాజీ సర్పంచ్ ఆదినారాయణ,మాజీ ఎంపీటీసీ రామయ్య,రామకృష్ణ,ప్యాపలి మండల టీడీపీ ఉపాధ్యక్షులు సుదీప్,సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *