జడ్పీ హైస్కూల్ ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
1 min read
కె రత్న ప్రసాద్
విద్యార్థులకు అందించే ఆహార విషయంలో రాజీ పడవద్దు
పాల్గొన్న సిడిపిఓ సూర్యచక్ర వేణి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ ఈరోజు స్థానిక శనివారం పేటలోని జడ్పీ హైస్కూలను సందర్శించారు. అందించే మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు విద్యార్థులకు అందించే ఆహార విషయంలో రాజీ పడవద్దు అని అలాగే వంటలలో ఉపయోగించే నూనె విషయంలో మరింత నాణ్యత పాటించాలని సూచించారు. ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాల పైన అవగాహన కలిగించాలని,విద్యార్థులకు అవసరమైనప్పుడు తర్ఫీదు పొందిన వ్యక్తులతో కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులకు ఆత్మస్త్రాన్ని నింపాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని నేటి సమాజంలో మానవక్రమాణ మరియు మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందని కావున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే బాలబాలికలు సోదర భావంతో కలిసిమెలిసి చదువును అభ్యశించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు మరియు కార్యక్రమంలో డిసిపిఓ సూర్య చక్రవేణి,వన్ స్టాప్ అడ్మిన్ నిర్మల, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
