NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ స్వామి వారి హుండీ ఆదాయం రూ.54,71,479/-లు

1 min read

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము

85 రోజులకుగాను ఆదాయం

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు: గురువారం ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయి గూడెం గ్రాములో వేంచేసి యున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు హుండీలను తెరచి లెక్కించుట జరిగినది. సదరు లెక్కింపును జిల్లా దేవదాయ శాఖ అధికారి, దేవదాయ ధర్మదాయ శాఖ, ఏలూరు వారి ఆద్వర్యములో శ్రీ కలగర శ్రీనివాసు కార్యనిర్వహణాధికారి,గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వారి పర్యవేక్షణలో కె.వీ.బీ .బ్యాంక్ సిబ్బంది సమక్షమున హుండీలను తెరచి లెక్కించగా 85 రోజులకు గాను దేవస్థానము హుండీల ద్వారా రూ.49,67,182/-లు, చిల్లర రూపేణా రూ.4,22,927/-లు వెరసి రూ.53,90,109/- అన్నదానం హుండీ ద్వారా రూ.78,200/- లు చిల్లర రూపేణా 3,170/-లు వెరసి రూ.81,370/-లు మొత్తం ఆదాయం రూ.54,71,479/- లు దేవస్థానమునకు సమకూరినది అని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి  ఆర్.వి.చందన ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *