కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకే పని గంటల పెంపు
1 min read
సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి, కార్యాలయం నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ ధర్నా
పని గంటలు తగ్గించాలని ఆర్డిఓ కి వినతి పత్రం అందించిన సిఐటియు నాయకులు
పత్తికొండ, న్యూస్ నేడు: సిఐటియు రాష్ట్ర పిలుపుమేరకు శుక్రవారం పత్తికొండ మండల సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన పని గంటలను తగ్గించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని స్థానిక పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి, కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం సీఐటీయూ పత్తికొండ మండల కార్యదర్శి డి. గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించగా పత్తికొండ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు రామాంజనేయులు, అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి డి. గోపాల్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి, సిఐటియు నాయకులు రవిచంద్ర, మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల శ్రమదోపిడి చేస్తున్నాయని, 8 గంటల పని విధానాలను కార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకుంటే వాటిని కాస్త 12 గంటలు పెంచే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడానికి పూనుకోవడం కార్మికుల గుండెల్లో పని భారం అనే గుణపాన్ని దించినట్లే అని అన్నారు. కార్మికుల రక్త మాంసాలను పిండి కార్పొరేటర్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కట్టపెట్టేందుకే చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని వారు విమర్శించారు.