కె.యం.సి లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ని శనివారం కర్నూల్ మెడికల్ కాలేజీ యందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కాలేజీ లోని ఎగ్జామినేషన్ హాల్ యందు కాలేజీ ఆధ్యాపకులు సిబ్బంది విద్యార్థులచే యోగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని విద్యార్థులు సిబ్బంది అధ్యాపకులు యోగ ను నిత్యజీవితంలో భాగంగా మార్చుకోవాలని ఆమె కోరారు. ఈ యోగా సెషన్ పతంజలి యోగ సమితి( యోగా గురువు యస్.వి. శివ రాజు) & భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ యొక్క యోగా గురువు ఉపేంద్ర మరియు వారి శిష్యులు యోగాచారి శ్రీ రంగా, శ్రీ శ్రీనివాసులు ఆద్వర్యం లో ఈ యోగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. సాయి సుధీర్, ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి డాక్టర్ మంజుల బాయి, డా . శోభారాణి, డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ శ్రీరాములు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సోమశేఖర్, యన్. యస్. యస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా . అరుణ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. విజయ్ బాబు డా. మంజుష ,డా. విజయలక్ష్మి, రీజనల్ ఐ హాస్పిటల్ రిటైర్డ్ సూపర్డెంట్ డాక్టర్ గిడ్డయ్య కాలేజీ సిబ్బంది వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.