NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్కు స్థలాన్ని ఖాళీ చేయాలి…

1 min read

అర్హతలు బట్టి ఇళ్ళులు మంజూరు చేస్తాం

అన్యాక్రాంతమైన పార్కు స్థలాన్ని పరిశీలించిన జేసీ బి.నవ్య

కర్నూలు, న్యూస్​ నేడు: శనివారం  కల్లూరు అర్బన్ 19వ వార్డు నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ యల్.పి. నెంబర్ 116/89 లో అన్యాక్రాంతమైన పార్కు స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు, ఆర్డీవో సందీప్‌లు శనివారం పరిశీలించారు. పార్కు స్థలంలో నివాసముంటున్న వారితో మాట్లాడి, వారి సమస్యలు విన్నారు. పార్కు స్థలంలో నివాసాలు ఏర్పాటు చేయడం కోర్టు ఆదేశాలకు విరుద్ధమని, ఖాళీ చేయాలని వివరించారు. అక్కడ ఉన్న ప్రజల అభ్యర్థన మేరకు గృహాల కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హతలు బట్టి మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.అన్యాక్రాంతమైన పార్కు స్థలాలయందు ప్రస్తుతం ఉన్న స్థితి గతులను క్షేత్రస్థాయిలో సర్వే చేసి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని   రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, వి.ఆర్.ఓలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *