గురుపూర్ణిమ సందర్భంగా గురువు కీ పాద పూజ చేసిన బీజేపీ నాయకులు
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు : అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే గురువులకు పాదాభివందనం. మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించి, మనకు స్ఫూర్తినిచ్చే,మార్గదర్శకులకు,గురుపూర్ణిమ సందర్భంగా హృదయపూర్వకంగా భక్తి శ్రద్దల తో డోన్ లో గాయత్రి పీఠం నందు అవధాని గుండ్లూరి దత్తాత్రేయ శర్మ ని సేవించి పాద పూజ చేసి వారిని శాలువాతో సత్కారం చేసుకొని ప్రధమ పూజ్యుడు అయినా మహాగణపతి ఫొటో అందించి వారి ఆశీర్వదము తీసుకొన డోన్ బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి, ఆర్మీ రామయ్య, రాజపురోహిత్ కమలేష్, ముదిరాజ్ లక్ష్మినారాయణ్, ఉమ్మాజి రామచంద్ర నాయుడు, పోలా వెంకటేశ్వర్లు, హరి నాయుడు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు .


