PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయవాడ బుడమేరు వరద బాధితులకు దుప్పట్లు ,చీరలు పంపిణీ

1 min read

రాయలసీమ శకుంతల

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ వరద బాధితుల కోసం మా రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో విజయవాడ బుడమేరు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము నీట మునిగిన వారికి మా వంతు సహాయంగా 100 మందికి చీరలు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాయలసీమ శకుంతల మాట్లాడుతూ కర్నూల్ లో కూడా వరదలు వచ్చినప్పుడు మనం కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అన్నమయ్య జిల్లాలో కూడా మూడు సంవత్సరాల కిందట వరదలు వచ్చినప్పుడు మా రాయలసీమ మహిళా సంఘ్ తరుపున అప్పుడు కూడా నిత్యవసర సరుకులు, దుప్పట్లు ,చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాయలసీమ మహిళా సంఘ్ మరియు దాతల సహాయ సహకారాలతో మా సంఘ్   ఎప్పుడు ముందుంటుంది అన్నారు. సహాయం చిన్నదా పెద్దదా అని కాకుండా ఎదుటివారికి ఆపద వచ్చినప్పుడు సహాయం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి పరోక్షంగా ,ప్రత్యక్షంగా సహాయం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ వారికి చీరలు దుప్పట్లు మాస్కులు కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో… విజయవాడకు చెందిన లీలావతి , కృష్ణవేణి, చందు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *