PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు ఆర్.సి.యం సంఘస్థుల సహకారం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): విజయవాడలో కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ వరద బాధితులను ఆదుకునేందుకు గాను కర్నూలు మేత్రాసన కాపరి(ఆర్.సి.యం బిషప్) గోరంట్ల జ్వాన్నేష్ ఆదేశాల మేరకు అన్ని విచారణల నుండి ఆర్థిక సహాయం పంపిస్తున్నారు.అందులో భాగంగానే మిడుతూరు మండలంలోని ఉప్పలదడియ విచారణలో ఉన్న ఉప్పలదడియ,కలమందలపాడు,మాసపేట,కడుమూరు,49 బన్నూరు,చౌటుకూరు, దేవనూరు, పైపాలెం, దిగువపాడు,కేతవరం గ్రామాల ప్రజల సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు.శుక్రవారం ఉదయం కర్నూలు మేత్రాసన సాంఘీక సేవా సంస్థ (కేడిఎస్ఎస్) డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ కు విచారణ గురువులు డి.మధుబాబు మరియు విచారణ పెద్దలు ఆనందరావు,పక్కిరయ్య, ఏసన్న,సామన్న,డేవిడ్ 28,460 రూపాయల నగదును ఫాదర్ సుధాకర్ కు వారు అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *