PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెయిజింగ్‌ రెజీనా..

1 min read

సినిమా డెస్క్​: సినిమాలు, టీవీ సీరియల్స్‌ చూసే వాళ్లతో పాటు ఓటీటీలు వచ్చాక వెబ్‌ సిరీసులకీ ఆదరణ బాగా పెరిగింది. అటు నార్త్‌, ఇటు సౌత్‌లోని దర్శక నిర్మాతలు వెబ్‌ మూవీస్‌, సిరీస్‌లపై ఫోకస్‌ పెడుతున్నారు. ఇందులో భాగంగా బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు తీసిన ఆర్కా మీడియా బ్యానర్ ఇప్పుడొక వెబ్ సిరీస్ రూపొందిస్తుంది. ‘అన్యాస్ ట్యుటోరియల్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో రెజీనా, నివేదిత, ఆగస్త్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లవి డైరెక్టర్. సౌమ్య కథ అందించింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా, ఆర్కా కలయికలో రానున్న సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఈ వెబ్ సిరీస్ షూటింగ్ రెండు రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ పల్లవితో నేనొక మూవీ చేద్దామనుకున్నా. ‘వేదం’ మూవీ నాటి నుంచి శోభు యార్లగడ్డతో నాకు పార్టనర్ షిప్ ఉంది. వేదం సినిమాకి నేను సైలెంట్ పార్టనర్ ని. ఈ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆర్టిస్ట్స్ దగ్గర్నుంచీ టెక్నిషీయన్స్ వరకు అందర్నీ ఎక్స్‌లెంట్ టీమ్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. అలాగే సినిమాలతో పాటు రెండు వెబ్ సిరీసుల్లో నటిస్తున్న రెజీనాకు ఆల్ ద బెస్ట్. ఏడు ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్ క్రిస్మస్ కి రిలీజ్ చేస్తాం’ అని చెప్పారు. స్ట్రాంగ్ టీమ్‌ వస్తున్న వెబ్ సిరిస్ ఇది. ఆహా లో లాంచ్ కావడం హ్యాపీ. మా కాంబినేషన్ లో మరిన్ని ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. రెజీనా మాట్లాడుతూ ‘ఆహా కోసం ఆర్కా వాళ్లు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారంటేనే ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. లేడీ రైటర్, లేడీ డైరెక్టర్ డెబ్యూ అని చెప్పగానే ఇంకా మంచి ఫీలింగ్ కలిగింది. రియలిస్టిక్ ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నారు. 2021లో ఉన్నా ఇంకా ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి క్యారెక్టర్ నేనెప్పుడూ చేయలేదు. మధు అనే పాత్రలో కనిపిస్తాను’ అని చెప్పింది. రైటర్ సౌమ్య, డైరెక్టర్ పల్లవి, నటులు ఆగస్త్య, నివేదిత పాల్గొన్నారు.

About Author