PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభావతిని గెలిపించండి..

1 min read
ప్రచారంలో పాల్గొన్న సురేందర్​ రెడ్డి

ప్రచారంలో పాల్గొన్న సురేందర్​ రెడ్డి

వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
– వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్​ సురేందర్​ రెడ్డి
పల్లెవెలుగు, కర్నూలు
దేశంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, అమలుచేయని సంక్షేమ పథకాలను ఏపీ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్​ సురేందర్​ రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని 15వ వార్డు బుధవార పేటలో పర్యటించారు. ఈ నెల 10న జరగనున్న కార్పొరేషన్​ ఎన్నికలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారరు. 15వ వార్డు అభ్యర్థి పోతురాజు ప్రభావతిని గెలిపించడం అందరు బాధ్యతగా భావించాలన్నారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా..సంతోషంగా ఉన్నారని, ఇది ఓర్వని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాయలసీమ.. వైసీపీకి కంచుకోటన్నారు. కార్య్రకమంలో వైసీపీ నగర అధ్యక్షులు రాజావిష్ణువర్ధన్​ రెడ్డి, వెంకటేశ్వరమ్మ, కేదారనాథ్​, సుగుణమ్మ, రుక్మిణి, నాగమణి, దినకర్​, స్వర్ణరాజ్​ , శివ తదితరులు పాల్గొన్నారు.

About Author