PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు రాజకీయంగా ఎదగాలి

1 min read
ప్రచారం చేస్తున్న హసీనాబేగం

ప్రచారం చేస్తున్న హసీనాబేగం

– ఇండిపెండెంట్​ అభ్యర్థులను గెలిపించండి
– ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​. హసీనాబేగం
పల్లెవెలుగు, కర్నూలు; మహిళలు రాజకీయంగా ఎదగాలని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​. హసీనాబేగం అన్నారు. శనివారం 15,47,48వ వార్డులలో బరిలో నిలిచిన ఇండిపెండెంట్​ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. 15వ వార్డు అభ్యర్థి శవల మహదేవమ్మ, 47వ వార్డు జెరదొడ్డి నర్సమ్మ, 48వ వార్డు భాస్కరమ్మను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఎస్​.హసీనాబేగం మాట్లాడుతూ ముగ్గురు ఇండిపెండెంట్​ అభ్యర్థులను గెలిపిస్తే.. ఆయా వార్డుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నేషనల్​ ఉమెన్స్​ పార్టీ తరుపున ప్రజలు, మహిళలకు అండగా ఉంటామన్నారు. 47వ వార్డు బ్రష్​, 48వ వార్డు ఉంగరం, 15వ వార్డ్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి.. వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్​డబ్ల్యూపీ మహిళా వింగ్​ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, కొత్తపేట ఇన్​చార్జ్ ప్రసన్న ,యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ , మరియు కార్యకర్తలు విజయమ్మ, ఎస్.సుజాత, బి.సుజాత, పి.సురేఖ, సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.

About Author