PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్తుల రిజిస్ట్రేషన్లూ..స్థానిక సచివాలయాల్లోనే!

1 min read

= త్వరలో అమలు కానున్న రిజిస్ట్రేషన్​ ప్రక్రియ

పల్లెవెలుగువెబ్​, అమరావతి: స్థానిక సచివాలయాలకు ఏపీ సర్కార్​ మరింత ప్రాధాన్యత కల్పించే నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ సైతం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జరిగేలా గురువారం ఉత్వర్వులు జారీ చేసింది. త్వరలో భూములు, ఇతరాత్ర స్థిరాస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను ప్రజలు నేరుగా స్థానిక సచివాలయాల్లో చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ప్రాథమికంగా 51సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్​ విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

About Author