PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త పార్టీ ప్ర‌క‌టించిన ఆజాద్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీకి రాజీనామా సమర్పించిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నేత గులాంనబీ అజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. డెమొక్రటిక్ అజాద్ పార్టీగా తన కొత్త పార్టీకి పేరును నిర్ణయించారు. పార్టీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన సొంత పార్టీని స్థాపించినట్టయింది. తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్ ప్రకటించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అవుతుందన్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోవడం తదుపరి ప్రాధాన్యతగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతాయనీ అన్నారు.

                                     

About Author