NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్యాగులు.. పాఠ్యపుస్తకాలు పంపిణీ

1 min read

న్యూస్ నేడు హొళగుంద:  ఎండి హళ్లి. గ్రామంలో మండల పరిషత్ పాఠశాల లో చదువుతున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు సర్పంచ్ సుధాకర్  అధ్యక్షతన పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీ సిద్ధన  ఆధ్వర్యంలో ప్రభుత్వం పంపినటువంటి బ్యాగులను మరియు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జీకే సుధాకర్  మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అందించడంలో కూటమి ప్రభుత్వం తన వంతు బాధ్యతగాకృషి చేస్తుందని కొనియాడారు. గత ప్రభుత్వం బొమ్మల పిచ్చితో పాఠశాలలో మధ్యన భోజన పథకం లో ప్రభుత్వ పేరు కాకుండా తమ సొంత పేర్లను ఉంచుకుందని కూటమి ప్రభుత్వం దేశంలో బ్రిటీష్ ప్రభుత్వ కాలంలోనే పేదలకు శరణార్థులకు ఆకలి తీర్చిన అన్నపూర్ణ దేవి గాచెప్పుకుంటున్నటువంటి ఆంధ్ర మాతృమూర్తి శ్రీ డొక్కా సీతమ్మ పేరును పెట్టి పేద విద్యార్థులకు సన్నబియ్యం తోనే మధ్యాహ్న భోజన పథకంలో ఏర్పాటు చేయడం జరిగిందని. అదేవిధంగా పాఠశాల విద్యార్థుల బ్యాగుల మీద భారతదేశ రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన విద్యావేత్త విద్యాసంస్కరణ కర్త శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  పేరు మీద పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వం కు భారత దేశ మహోన్నత వ్యక్తుల మీద ఉన్నటువంటి ఆధార అభిమానమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హొళగుంద మండలం తెలుగు యువత నాయకులు కురువ నాగరాజు . పాఠశాల ఎస్ఎంసి కమిటీ వైస్ చైర్మన్ హరిజన సునీతమ్మ . తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హరిజన దాసప్ప  మరియు తదితర గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *