PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌దిలో డ‌బ్బులు మూట‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాకినాడ జిల్లా కరప మండలం వేళంగి గ్రామంలో జ‌రిగిన‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ సాధువు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించారు. ఆయ‌న గ‌దిలో పెద్ద ఎత్తున పాలిథీన్ సంచులు కంట‌బ‌డ్డాయి. వాటిలో భారీగా చిల్ల‌ర డ‌బ్బు ఉంది. ఆ సాధువు పేరు రామకృష్ణ. ఐదేళ్ల కిందట గ్రామానికి వచ్చాడు. భిక్షాటన చేస్తూ.. రక్ష రేకులు కడుతూ జీవనం సాగించేవాడు. చేపల మార్కెట్‌ వద్ద చిన్న గదిలో ఉంటూ సమీపంలోని సత్రంలో భోజనం చేసేవాడు. అతడు గురువారం గుండెపోటుతో చనిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. ఈ విషయమై కరప ఎస్‌ఐ డి.రమేశ్‌బాబును మాట్లాడుతూ అతడి వద్ద లభించిన నగదులో పది రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయని, చీకటి పడడంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదన్నారు. నోట్లు, చిల్లరను సంచుల్లో పెట్టి సీలు వేసి స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం లెక్కిస్తామని చెప్పారు. పంచాయతీ కార్మికులతో సహాయంతో మృతదేహాన్ని ఖననం చేసినట్టు తెలిపారు. కాగా, అతడి వద్ద లభించిన నగదు రూ.2లక్షలకు పైనే ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు.

                                               

About Author