PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ తో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఓ సోష‌ల్ మీడియా చ‌ర్చా వేదిక‌లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు దుర‌దృష్టక‌ర‌మ‌ని, త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక .. ఈ అంశం మీద పునఃప‌రిశీలిస్తామ‌ని వ్యాఖ్యానించారు. పాక్ జ‌ర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స‌మాధానంగా దిగ్విజ‌య్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీని పై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ తో ఒప్పందం కుదుర్చుకుంద‌ని విమ‌ర్శించింది. దిగ్విజ‌య్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ విడుద‌ల చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలు ఈ వ్యాఖ్యల మీద స్పందించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యాఖ్యల‌తో కాంగ్రెస్ పార్టీ కొంత ఇర‌కాటంలో ప‌డింది.

About Author