NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాంతాలు, కుల,మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర

1 min read

అడుగడుగునా మహిళలను అవమానిస్తున్నారు

ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం

వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది

జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి

నిరంతరం కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండాలి

పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం

పార్వతీపురం, న్యూస్​ నేడు:  ప్రాంతాలు, కుల, మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం చినబొండపల్లిలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. ఈ రోజు చాలా వింత పరిస్థితి. దారిపొడవునా ఎక్కడ చూసినా పోలీసులే. యువగళంలో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆనాడు అడ్డుకున్న పోలీసులే నేడు సెల్యూట్ చేస్తున్నారు. అదీ ప్రజాతీర్పు. ప్రతిపక్షంలో ఆనాడు చంద్రబాబు గారు చలో ఆత్మకూరు పిలుపునిస్తే గేట్లకు తాళ్లు కట్టారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. నాపై 23 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. యువగళం పాదయాత్రలో మైక్, స్టూల్ లాక్కుకున్నారు. అయినా బిల్డింగ్ పైకి ఎక్కి మాట్లాడా. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరించాలి.

జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి

నేడు కూటమి ప్రభుత్వంలో వృద్ధులకు రూ.4వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా కోటి మందికి గ్యాస్ సిలిండర్లు అందజేశాం. వచ్చే నెల నుంచి గ్యాస్ సబ్సీడీ నేరుగా బ్యాంక్ అకౌంట్లకే బదిలీ చేస్తాం. సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. వచ్చే నెల తల్లికి వందనం కార్యక్రమం అమలుచేస్తాం. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. జులై 1 నుంచి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని వివరించాలి. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుస్తామనే హామీని నిలబెట్టుకున్నాం. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలనజవాన్లు ఎక్కడ కనిపించినా సెల్యూట్ చేయాలిపహల్గాంలో అమాయక ప్రజలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. 2004 నుంచి 2014 వరకు దేశంపై 25 వరకు ఉగ్రదాడులు జరిగాయి. మోదీ వచ్చిన తర్వాత ధీటైన సమాధానం చెబుతున్నారు. మనం క్షేమంగా ఉంటున్నామంటే సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే. మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ. ఇంటి దగ్గరే ఉండాలని కోరినా వినలేదు. తాను చనిపోతే దేశం మొత్తం కదిలివస్తుందని చెప్పాడు. మొన్న దాడులు జరుగుతున్న సమయంలో కూడా మిత్రుడికి మెసేజ్ పెట్టాడు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని చెప్పాడు. జవాన్లు ఎక్కడున్నా అండగా నిలవాలి. ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ప్రధానికి అండగా నిలుద్దాం. జవాన్లు ఎక్కడ కనిపించినా వారికి సెల్యూట్ చేయాలన్నారు. జోహార్ మురళీ నాయక్, వందేమాతరం అంటూ మంత్రితో పాటు అందరూ నినదించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *