NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షరాల పేరుతో విద్య దోపిడీ అరికట్టాలి…

1 min read

అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న భాష్యం పాఠశాలను సీజ్ చేయాలి….

పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా…

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:   ఎమ్మిగనూరు పట్టణంలో ఫీజుల బోర్డ్ లేకుండా వేలకు వేలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న భాష్యం పాఠశాలపై చర్యలుతీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్ధి సంఘం(పి.డి.యస్.యు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర  బాబు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక పట్టణంలో భాష్యం పాఠశాలకు  వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున  ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి.మహేంద్ర బాబు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా   భాష్యం స్కూల్ యాజమాన్యం పాఠశాలలోనే  పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో అంగడి దుకాణం లా దోచుకుంటున్నా కూడా విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడునట్లు ఉండడం  దారుణమన్నారు. అదేవిధంగా భాష్యం పాఠశాల యాజమాన్యం ఆర్.టి.ఈ విద్యార్థుల నుండి అదనపు కార్యక్రమాల పేరుతో 8 వేల నుండి 10 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని సంబందించిన అధికారులకు విన్నవించిన పేడచెవినా పెడుతున్నారని వారు అన్నారు.అలాగే  పాఠశాల భవనం పరితికి మించి అడ్మిషన్స్ నిర్వహిస్తున్న ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏంటో అని వారు అన్నారు.కావున విద్యాశాఖ అధికారులు భాష్యం పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి పాఠశాలను సీజ్ చేయాలనీ వారు డిమాండ్ చేశారు లేనిపక్షం లో ఆ పాఠశాల ముందు దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పి.డి.ఎస్.యు నాయకులు గోవర్ధన్, ధనుష్, ప్రమోద్,తన్విర్, ప్రవీణ్, సూర్య, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *