PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాసనమండలికి ప్రశ్నించే వారిని ఎన్నుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరుగుతున్నo దున పట్టభద్రుల ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిడాక్టర్ పోతుల నాగరాజు గారి గెలుపుకై వెలుగోడు మండలం లోని వేల్పనూరు గ్రామంలో గురువారం అవాజ్ కమిటీ జిల్లా నాయకులు మహమ్మద్ రఫీ , జాతీయ బి.సి.సంఘము రాష్ట్ర కార్యదర్శి రఘు రాముడు యాదవ్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి రామదాసు, డాక్టర్ పోతుల నాగరాజు గారి గెలుపు కోసం ఇంటింటా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరాష్ట్ర,కేంద్ర ప్రభుత్వలు నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది అన్నారు. బిఏ ఎంబిఏ బీటెక్ లు చదివి రోడ్లపై ఆటోలు నడుపుతూ, షాపు గుమస్తాలుగా, బజార్ అమాలీలుగా, దినసరి కూలీలుగా జీవిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. వరుస నెంబర్ 27 కు ఎదురుగా (1) అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారన్నారు.

About Author