ఉపాధి హామీ లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవు
1 min read
నలుగురు ఎంపిడిఓ లు, ఏపీఓ లకు షో కాజ్ నోటీసులు జారీ
జూన్ మొదటి వారం లోపు పెండింగ్లో ఉన్న గోకులం నిర్మాణాలు పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: ఉపాధి హామీ లోలక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.బుధవారం ఉపాధి హామీ పథకం అమలుపై స్పెషల్ ఆఫీసర్లు,ఎంపీడీవోలు ఏపీడీలు ఏపీవోలు తత్తర అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి రోజు లక్ష 50 వేల మంది కూలీలకు పనులు కల్పించే విధంగా లక్ష్యాల్ని నిర్దేశించడం జరిగిందని, అందులో కేవలం లక్ష 3 వేల మంది మాత్రమే హాజరు అయ్యారన్నారు.. ఈరోజు పనులకు కల్పించి నిర్దేశించిన లక్ష్యాల్లో గోనెగండ్ల, తుగ్గలి, ఆదోని, పత్తికొండ మండలాలు చాలా వెనుకబడి ఉన్నారన్నారు.. ఎమ్మిగనూరు, ఆస్పరి, ఆదోని, నందవరం, ఓర్వకల్లు, ఆలూరు, పెద్దకడుబూరు మండలాలు 50 శాతం లోపు లక్ష్యాలు సాధించారని, పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత మండలాల ఎంపిడిఓ లను ఆదేశించారు.ఫారం పాండ్స్ పనులు పూర్తి చేయడంలో మద్దికేర మండలం చాలా బాగా చేశారని కలెక్టర్ మద్దికేర ఎంపిడిఓ ను అభినందించారు… ఆలూరు, వెల్దుర్తి, తుగ్గలి మండలాలు కూడా బాగానే చేశారన్నారు.. కోడుమూరు, నందవరం, దేవనకొండ, గోనెగండ్ల చాలా వెనుకబడి ఉన్నారన్నారు.. వారానికి 50 మేరకు లక్ష్యాలను పెట్టుకుంటే సాధించేందుకు వీలవుతుందన్నారు.. గోనెగండ్ల, కౌతాళం, ఆదోని మండలాలు ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి అంశంలోనూ చాలా వెనుకబడి ఉన్నారని, పురోగతి తీసుకొని రావాలన్నారు.హార్టికల్చర్ ప్లాంటేషన్ కి సంబంధించి భూములను త్వరితగతిన గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. గోకులం నిర్మాణాలకు సంబంధించి పనులు పూర్తి చేయడంలో వెల్దుర్తి, కల్లూరు, దేవనకొండ, సి. బెలగల్, ఓర్వకల్లు, కర్నూలు మండలాలు చాలా వెనుకబడి ఉన్నాయని పురోగతి తీసుకొని రావాలన్నారు.. జూన్ మొదటి వారం లోపు గోకులం నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డ్వామా పిడి వెంకటరమణయ్య, అన్ని మండలాలు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.