ఉత్సాహం..తమ్ముళ్లలో ‘మహానాడు’జోష్
1 min read
మిడుతూర్ నుండి భారీగా వెళ్లిన కార్యకర్తలు..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం రెట్టింపు అయింది.గత మూడు రోజులుగా కడపలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జరిగిన మహానాడు కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆనందోత్సాహం పెల్లు బికింది.కడపలో 27 నుండి 29వ తేదీ వరకు చివరి రోజు నిన్న జరిగిన మహానాడు కార్యక్రమానికి నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అన్ని గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు గురువారం ఉదయాన్నే భారీగా తరలి వెళ్లారు.మొదటి రోజున టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి తదితర నాయకులు మహానాడుకు వెళ్లారు.నిన్న మండలంలోని వివిధ గ్రామాలు కలమందలపాడు,పైపాలెం, చౌటుకూరు,49 బన్నూరు, రోళ్లపాడు,సుంకేసుల, ఉప్పలదడియ,తిమ్మాపురం బైరాపురం తలముడిపి తదితర గ్రామాల నుండి కార్యకర్తలు భారీగా బస్సుల్లో మహానాడుకు తరలి వెళ్లారు.మహానాడుకు వెళ్ళిన వారిలో రోళ్లపాడు మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి,గోకారి, నరసింహ గౌడ్,షబ్బు,ఇద్రిస్, జయరాముడు,వెంకటేశ్వరరెడ్డి,మహేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు,రమణారెడ్డి,సోపి సాహెబ్,మొల్ల చాకర్ వలి తదితరులు పాల్గొన్నారు.
