NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి – జై భీమ్ ఆర్గనైజేషన్ 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల నుండి అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జై భీమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల ఎంఈఓల తిమ్మారెడ్డి, రమేష్ గార్లకు వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల సోమన్న ఉపాధ్యక్షులు మునుస్వామి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పత్తికొండ మండల పరిధిలోని ప్రైవేట్ అండ్ కార్పొరేటర్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని అలాగే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రవేట్ అండ్ కార్పొరేట్ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ప్రభుత్వానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలల యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలని  లేని పక్షంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హజి, రాజు, గోవింద్, రవి, సంతోష్, సతీష్, సంతోష్ కుమార్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *