NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు పండించిన పొగాకు ను తక్షణమే కొనుగోలు చేయాలి

1 min read

పొగాకు కంపెనీ లను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో రైతులు పండించిన పొగాకు ను తక్షణమే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య పొగాకు కంపెనీ లను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో  పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు, జిల్లా వ్యవసాయాధికారి,వ్యవసాయ శాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన పొగాకును తక్షణమే కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు, రైతు పండించిన పొగాకు వర్షాల కారణంగా తడిస్తే పొగాకు క్వాలిటీ తగ్గుతుందని కావున తక్షణమే పొగాకు కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ పొగాకు కంపెనీల ప్రతినిధులకు తెలియజేశారు, ఎస్​ఏపీ  (సిరి పొగాకు)  కు సంబంధించి కొనుగోలు కేంద్రాన్ని ఎక్కువ పంట పండించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి పొగాకు  కొనుగోలు చేయాలని జిపిఐ కంపెని  ని ఆదేశించారు.  బీడి పొగాకు‌ , నాటురకం పొగాకు ను కూడా పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఐటిసి, జిపిఐ, విఎస్టి , Alliance, PTP Ltd,కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.ఈ విషయం పై పొగాకు కంపెనీ ప్రతినిధులు రైతుల వద్ద నుండి పొగాకును కొనుగోలు చేసిన తక్షణమే రైతు నుండి పొగాకును  కంపెనీలకు తరలించుకోవాలని కంపెనీ ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ తెలియజేశారు.  ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి,సహాయ వ్యవసాయ సంచాలకులు సాలు రెడ్డి, కర్నూలు డివిజన్ మండల వ్యవసాయ అధికారులు, వివిధ పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *