NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫోరెన్సిక్​ పై అవగాహన పెంచుకోండి..

1 min read

నర్సింగ్​ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్​

  • కేఎంసీ వైస్​ ప్రిన్సిపల్​ డా. సాయి సుధీర్​

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు: నర్సింగ్​ విద్యార్థులు ఫోరెన్సిక్​ పై అవగాహన పెంచుకుంటూ భవిష్యత్​ ఉజ్వలంగా ఉంటుందని కర్నూలు మెడికల్​ కాలేజి వైస్​ ప్రిన్సిపల్​ డా. సాయి సుధీర్​ అన్నారు.  స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ఫౌండేషన్​ ప్రధాన సెక్రటరి,  ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ డా. చంద్ర శేఖర్​ నేతృత్వంలో నర్సింగ్​ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఫోరెన్సిక్​ పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన కేఎంసీ వైస్​ ప్రిన్సిపల్​ డా. సాయి సుధీర్​ మాట్లాడుతూ అత్యవసర కేసులు, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు ,  వృద్ధులు, వితంతువులపై దాడులు తదితర కేసులకు సంబంధించి డాక్టర్లతోపాటు నర్సులు కూడా అవసరమైతే కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​  ఆదేశానుసారం నర్సింగ్​ కోర్సులు మూడో సంవత్సరం చదువుతున్న వారికి  ఫోరెన్సిక్​ కోర్సు కూడా చేర్చుతారన్నారు.  ఫోరెన్సిక్​ కోర్సును చేర్చడం వల్ల నర్సింగ్​ విద్యార్థులకు  ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని,ఆ కోర్సు టీచర్లు, సిబ్బందిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుందన్నారు. భవిష్యత్​ లో ఉజ్వల భవిష్యత్​ ఉంటుందని, ఇండియన్​ మెడికల్​ కౌన్సిల్​ కల్పించిన​ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేఎంసీ వైస్​ ప్రిన్సిపల్​ డా. సాయి సుధీర్​ నర్సింగ్​ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో హార్ట్​హెల్త్​ క్లబ్​ గౌరవాధ్యక్షులు చంద్ర శేఖర్​ కల్కూర,  డా. భవాని ప్రసాద్​, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author