NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

1 min read

ప్రశాంతంగా వృషభాల పారువేట

ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయించిన సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య.

వేడుకలను తిలకించిన గ్రామస్తులు, మహిళలు, యువతి, యువకులు.

హాజరైన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు.

మంత్రాలయం, న్యూస్​ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో ఏరువాక పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రాలయం లో తెల్లవారుజామున నుండి వివిధ దేవాలయాల్లో ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  వృషభాల ను తుంగభద్ర నది లో స్నానాలు చేయించి వివిధ రకాల రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం సంత మార్కెట్ లో వృషభాల పారువేట  ప్రశాంతంగా ముగిసింది. వృషభాల పారువేట సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో ఎస్ఐ శివాంజల్ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పారువేట సమయంలో వృషభాలు ఎక్కడ పడితే అక్కడ పరుగెత్తకుండా సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్ ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయించారు. వృషభాల పారువేట కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్థులు, మహిళలు యువతి, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వృషభాల పారువేట లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కు చెందిన వృషభం విజయం సాధించడం తో భాజభజంత్రీల మద్య పురవీధుల గుండా ఊరేగించారు. పారువేట కార్యక్రమం లో వీఆర్వో భీమన్న గౌడ్, టీడీపీ మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్ కృష్ణ, పూజారి వ్యాసరాజ్ స్వామి, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి మేకల వెంకటేష్, అశోక్ రెడ్డి, వరదరాజు, వట్టేప్ప నర్సింహ, సుంకప్ప, సున్నం రామకృష్ణ, రాఘు, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ సున్నం గురురాజ,చిన్న భీమన్న, వట్టేప్ప రఘు, వనికే నాగరాజు, హనుమంతు, ఏబు, వైకాపా నాయకులు మండల కురవ మల్లికార్జున, ఎంపిటిసి వెంకటేష్ శెట్టి, జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే మండల పరిధిలోని చెట్నహల్లి, కల్లుదేవకుంట, మాలపల్లి, సుంకేశ్వరి తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *